సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సీజన్ నడుస్తుండటం, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో నగరంలో అనేక వ్యాపారాలు జోరందుకున్నాయి. కేడర్, ప్రచారానికి వచ్చే వారితో పాటు ఇతరుల కోసమూ నిర్ణీత సమయానికి ముందు, ముగిసిన తర్వాత కూడా కొన్ని వ్యాపార సంస్థలు పని చేస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసులు ఆయా వ్యాపార సంస్థలకు సంబంధించిన ‘టైమ్ టేబుల్’ ఆదివారం విడుదల చేశారు. వీటిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఠాణాలు, క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
● దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలు: ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు
● హోటళ్లు, రెస్టారెంట్లు: తెల్లవారుజాము 5 నుంచి రాత్రి 12 గంటల వరకు
● మద్యం దుకాణాలు: ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు
● బార్లు, పబ్స్: ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు (శుక్ర, శనివారాల్లో రాత్రి ఒంటి గంట వరకు)