పూర్వ వైభవం కోసం..

2 Dec, 2023 05:06 IST|Sakshi

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సత్తా చాటిన కాంగ్రెస్‌.. మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు ఈసారి తీవ్రంగా శ్రమించింది. 2009లో వైఎస్‌ హయాంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ.. క్రమంగా చతికిలబడింది. 2014, 2018 ఎన్నికల్లో తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో గ్రేటర్‌లో కేవలం ఎల్‌బీనగర్‌, మహేశ్వరం సీట్లు గెలుచుకొని పరాభవం మూటగట్టుకుంది. గెలిచిన అభ్యర్థులు సైతం అధికారపార్టీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారిన కాంగ్రెస్‌.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు తోడు అభ్యర్థులకున్న ఆర్థిక, రాజకీయ బలం కలిసి ‘పైచేయి’ నిలిచే అవకాశాలున్నట్లు పోలింగ్‌ సరళిని బట్టి తెలుస్తోంది.

మరిన్ని వార్తలు