Sakshi News home page

అత్యధిక స్థానాలు మావే: బీఆర్‌ఎస్‌

Published Sat, Dec 2 2023 5:06 AM

- - Sakshi

గ్రేటర్‌ పరిధిలో తమకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అధిక స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే మరోసారి గెలుస్తారని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలోని 29 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను దాదాపు 15 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ గ్రేటర్‌ పరిధిలో మాత్రం ఎక్కువ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని చెబుతున్నారు. కేసీఆర్‌అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నగరంలో మునుపెన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఇతర పార్టీల కంటే ముందుగానే గులాబీ అభ్యర్థులను ప్రటించడంతో తమ నియోజకవర్గాల్లో మరింత శ్రద్ధ చూపి ప్రజల్లోకి చొచ్చుకుపోయారని ఇలా ఏ విధంగా చూసినా తమకు సీట్లు తగ్గే పరిస్థితే లేదంటున్నారు. మిత్రపక్షమైన ఎంఐఎం ఏడు స్థానాలు గెలుచుకోవడంతో పాటు విపక్షాలకు చెందిన రెండు పార్టీలూ కలిసి మరో ఆరేడు స్థానాల్లో గెలిచినా తమకు 15 స్థానాలు లభిస్తాయంటున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement