విద్యావంతులను ప్రోత్సహించాలి

1 Jan, 2024 05:12 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనాథ్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆధునిక యుగంలో విద్యావంతులను ప్రోత్సహించాలని పీవీ రాంరెడ్డి పీజీ కళాశాల సెక్రెటరీ పోరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడలో ఉస్మానియా యూనివర్సిటీ గోల్డెన్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా జాతీయ స్థాయిలో మెగా సెమినార్‌ను ‘మోడ్రన్‌ ట్రెండ్స్‌ ఇన్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ ఎడ్యూకేషన్‌’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. దీనికి కళాశాల కార్యదర్శి శ్రీనాథ్‌రెడ్డి, డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ఆధునిక యుగంలో విద్య ఎంతో అవసరమన్నారు. మేనేజ్‌మెంట్‌ విద్యలో జరిగే మార్పుల గురించి వివరించారు. విద్యార్థులు దానికి తగ్గట్టుగా నైపుణ్యాలను నేర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్స్‌పాల్‌ శ్రీనివాస్‌, మహేష్‌, హరిత, శృతి, రమేష్‌, శ్రీదేవిలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

‘మోడ్రన్‌ ట్రెండ్స్‌ ఇన్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌’పై సమావేశం

>
మరిన్ని వార్తలు