రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

22 Mar, 2023 02:02 IST|Sakshi

హోసూరు: హోసూరు ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వివరాల మేరకు హోసూరు పారిశ్రామికవాడ బేడరపల్లి ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ ఆనందయ్య (53). సోమవారం సాయంత్రం హోసూరు– బెంగళూరు జాతీయ రహదారి ప్రైవేట్‌ నగల దుకాణం వద్ద ద్విచక్రవాహనంలో వెళ్లుతుండగా ఆ మార్గంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. అలాగే హోసూరు సమీపంలోని చెన్నత్తూరు ప్రాంతానికి చెందిన వెంకటేశప్ప (57) బత్తలపల్లి మార్కెట్‌ వద్ద నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు