కాంగ్రెస్‌కు 70, మాకు 130 సీట్లు

28 Mar, 2023 00:32 IST|Sakshi

మైసూరు: ఈ శాసనసభ ఎన్నికల్లో అధికారం వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ కలలు కంటోందని, కానీ ఆ పార్టీ 70– 75 సీట్ల కంటే ఎక్కువ గెలువలేదని జేడీఎస్‌ మాజీ సీఎం హెచ్‌డి కుమారస్వామి జోస్యం చెప్పారు. సోమవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము త్వరలోనే రెండవ జాబితాను విడుదల చేస్తాం, ఎన్నికల్లో 123 నుంచి 130 స్థానాల్లో గెలుస్తామని చెప్పారు.

కాంగ్రెస్‌ నాయకుడు సిద్దరామయ్యకే గెలుస్తానన్న నమ్మకం లేదన్నారు. వరుణలో నిలబడితే కుమారునికి భవిష్యత్తు ఉండదని భయపడుతున్నాడని అన్నారు. మమ్మల్ని కుటుంబ రాజకీయం అంటున్న సిద్దరామయ్య కొడుకు కోసం ఎందుకు ఇలా పరుగులు పెడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కర్ణాటకలో బీజేపీ వంటి అతి చెడ్డ ప్రభుత్వం రావడానికి మూల కారణం కాంగ్రెస్‌ నాయకులు అని కుమార ఆరోపించారు. దేశంతో పాటు రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తోందని, ప్రజల సొమ్మును బీజేపీ నాయకులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు