ఖమ్మం లీగల్: న్యాయవాదులు నిత్య విద్యార్థులుగా వృత్తినైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) ఆధ్వర్యాన శనివారం టీటీడీసీలో న్యాయవాదులకు వృత్తి నైపుణ్య తరగతులు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ కమిషన్ వర్క్ను ఎలా చేయాలనే అంశంపై వివరించారు. అనంతరం ఖమ్మం అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.ఆశారాణి న్యాయవాద విలువలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లమల నవీన్ చైత న్య, చింతనిప్పు వెంకట్తో పాటు మందడపు శ్రీని వాసరావు, ఏడునూతల శ్రీనివాసరావు, వంజాకుల లక్ష్మీనారాయణ, మీసాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసరావు