పాఠశాలల్లో రాష్ట్ర బృందం పరిశీలన | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 5 2023 12:02 AM

-

కల్లూరు/కల్లూరురూరల్‌/తల్లాడ: పలు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీ క్షలకు సిద్ధం చేస్తున్న తీరును రాష్ట్ర పరిశీలక బృందం సభ్యులు పర్యవేక్షించారు. కల్లూరు, చెన్నూరు, కుర్నవల్లి పాఠశాలల్లో శనివారం రాష్ట్ర బృందం కన్వీనర్‌ యానాల వెంకటరెడ్డి సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు సి ద్ధం కావాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. అలాగే, వెనుకబడిన విద్యార్థులకు అభ్యాస దీపికలు అందించాలని, ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధి కారి రవికుమార్‌, రాష్ట్ర పరిశీలక బృందం సభ్యుడు కన్నెగంటి వెంకటయ్య, ఎంఈఓ ఎన్‌. దామోదరప్రసాద్‌, నోడల్‌ అధికారులు కె.విజయ్‌ బాబు, కె.శ్రీనివాసరెడ్డి, హెచ్‌ఎంలు జి.మాధవరావు, కృష్ణమోహన్‌, రవీంద్ర, శివ, వేలాద్రి, లక్ష్మీతాయారు, కృష్ణయ్య, శ్రీనివాసరెడ్డి, శివకృష్ణతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement