నాకు 80 ఏళ్లకు పైగా వయస్సు ఉంది. నాకు నలుగురు కుమారులు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. కూలి పనులకు వెళ్లే శక్తి లేదు. టీడీపీ హయాంలో పింఛన్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటరీ ద్వారా దరఖాస్తు చేసుకుంటే నెలలోపే పింఛన్ మంజూరైంది. నాలుగేళ్లుగా ఠంచన్గా పింఛన్ ఇస్తున్నారు. ప్రభుత్వ సేవలు బాగున్నాయి. పేదలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేం రుణపడి ఉంటాం.
– సామేల్, బైచిగేరి, ఆదోని మండలం