హిందీలోకి దూకుడు

31 Aug, 2020 06:27 IST|Sakshi
అనీజ్‌ బజ్మీ

మహేశ్‌బాబు కెరీర్‌లో భారీ హిట్స్‌లో ‘దూకుడు’ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బాలీవుడ్‌లో రీమేక్‌ కాబోతోంది. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ‘వెల్కమ్, సింగ్‌ ఈజ్‌ కింగ్, పాగల్‌ పంతీ’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన అనీజ్‌ బజ్మీ ఈ రీమేక్‌ని తెరకెక్కించనున్నారు. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటిస్తారని సమాచారం.

మరిన్ని వార్తలు