రెండు హృదయాల కల 

11 Nov, 2023 03:25 IST|Sakshi

‘రూహి’ చిత్రం తర్వాత రాజ్‌కుమార్‌ రావు, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’. ‘నో డ్రీమ్‌ ఈజ్‌ ఎవర్‌ చేజ్డ్‌ ఎలోన్‌!’ అనేది క్యాప్షన్‌. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఫిల్మ్‌కు శరణ్‌శర్మ దర్శకత్వం వహించగా, కరణ్‌ జోహార్‌ నిర్మించారు.

‘‘ఒకే కల కోసం రెండు హృదయాలు ఎదురు చుస్తున్నాయి’’ అంటూ ఈ మూవీని ఏప్రిల్‌ 19న రిలీజ్‌ చేయనున్నట్లుగా జాన్వీ కపూర్‌ అండ్‌ టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

మరిన్ని వార్తలు