Kangana Ranaut Visits Tirumala Temple: బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసారు. తాను నటించిన తాజా చిత్రం ధాకడ్ విడుదల కానున్న సందర్భంగా విజయం సాధించాలని మొక్కుకున్నారు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించిన 'ధాకడ్' మూవీలో కంగనా రనౌత్ ఏజెంట్ అగ్నిగా నటించింది. ఇదివరకు విడుదలైన మూవీ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోయే యాక్షన్స్ సీన్లలో కంగనా మెస్మరైజ్ చేసింది. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో 'ధాకడ్' తెరకెక్కింది. ఇందులో విలన్ రోల్లో అర్జున్ రాంపాల్ చేయగా మరో కీలక పాత్రలో దివ్యా దత్త నటించింది. మరీ ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే.
చదవండి: అక్షయ్, అజయ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..
మహేశ్ బాబు అన్నదాంట్లో తప్పేముంది? సపోర్ట్గా నిలిచిన కంగనా