సీతగా మహానటి?

21 Aug, 2020 02:21 IST|Sakshi

‘బాహుబలి, సాహో’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ జోరు పెంచారు. ప్రస్తుతం ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తన 21వ చిత్రం చేసేందుకు పచ్చజెండా ఊపారు ప్రభాస్‌. 22వ చిత్రం ‘ఆదిపురుష్‌’ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘తానాజీ’ ఫేమ్‌ ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహించనున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

ఇందులో రాముడి పాత్రను ప్రభాస్‌ పోషిస్తారని సమాచారం. మరి రాముడికి సీతగా ఎవరు నటిస్తారు? అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో అప్పుడే మొదలైంది. కాగా సీత పాత్రకు కీర్తీ సురేష్‌ని అనుకుంటున్నారట చిత్రవర్గాలు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు కీర్తీ సురేష్‌. సీత పాత్రకు ఆమె అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి టి సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మాత.

>
మరిన్ని వార్తలు