Love Reddy : ఆంధ్ర , కర్ణాటక సరిహద్దులో జరిగే స్వచ్ఛమైన ప్రేమ కథ

4 Jan, 2023 10:13 IST|Sakshi

అంజన్‌ రామచంద్ర, శ్రావణీ రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్‌ రెడ్డి’. స్మరన్‌ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ హేమలతా రెడ్డి, మదన్‌ గోపాల్‌ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప నిర్మించారు. ఈ చిత్రం గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘లవ్‌ రెడ్డి’ గ్లింప్స్‌ చాలా ఫ్రెష్‌ గా ఉంది. ఈ గ్లింప్స్‌ చూశాక నాకు కూడా ఒక లవ్‌స్టోరీ చెయ్యాలనిపిస్తోంది. యంగ్‌ టీమ్‌ చేసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు.

‘‘ఆంధ్ర , కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంటుంది’ అన్నారు స్మరన్‌ రెడ్డి. ‘‘ఒక మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది అన్నారు’’ అంజన్‌ రామచంద్ర.

మరిన్ని వార్తలు