నటుడు మన్సూర్‌ అలీఖాన్‌కు అస్వస్థత

11 May, 2021 09:57 IST|Sakshi

తమిళ సినిమా: నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్‌ అలీఖాన్‌ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక అంజిగరైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చేరారు. మన్సూర్‌ అలీఖాన్‌ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఇక కరోనా పరీక్షలో ఆయనకు నెగిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే మన్సూర్‌ అలీఖాన్‌ అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు.

చదవండి: తల్లి ఆశీస్సులతో 16 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చా..

మరిన్ని వార్తలు