‘నేనెవరు’ ఒక స్పెషల్ జోనర్ ఫిల్మ్..వారికి నచ్చుతుంది: నిర్ణయ్ పల్నాటి

1 Dec, 2022 18:11 IST|Sakshi

రొటీన్ సినిమాలకు భిన్నంగా రూపొందిన "నేనెవరు" ఒక స్పెషల్ జోనర్ ఫిల్మ్ అంటున్నాడు యువ దర్శకుడు నిర్ణయ్ పల్నాటి. లవ్, సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళందరూ "నేనెవరు" చిత్రంతో కచ్చితంగా కనెక్ట్ అవుతారని అన్నాడు. నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై  భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘నెనెవరు’. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటించాడు. సాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

డిసెంబర్‌ 2న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శఖుడు నిర్ణయ్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రం ఇంత అద్భుతంగా రావడం కోసం నిర్మాతలు భీమినేని శివప్రసాద్ - తన్నీరు రాంబాబు ఎంతో శ్రద్ధ తీసుకున్నారని, ప్రతి ఫ్రేమును ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దామని  తెలిపాడు. హీరో కోలా బాలకృష్ణ కెరీర్ కి ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశాడు. కోలా భాస్కర్ ఎడిటింగ్, ఆర్.జి.సారథి సంగీతం ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలని యువ ప్రతిభాశాలి పల్నాటి తెలిపాడు.

మరిన్ని వార్తలు