Sai Dharam Tej And His Family: హీరో సాయిధరమ్ తేజ్ కుటుంబ సమేతంగా సోమవారం విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాలను, శేషవ్రస్తాలను బహూకరించారు.
ఎప్పుడూ విజయవాడ వచ్చిన తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటానని సాయి ధరమ్ తేజ్ తెలిపాడు. చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగిందన్నాడు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకొని కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నట్లు సాయిధరమ్తేజ్ కుటుంబ సభ్యులు తెలిపారు.