Samantha-Vijay : కేరళకు వెళ్లిన సమంత, విజయ్‌ దేవరకొండ... కారణమిదే

31 Mar, 2023 09:59 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా లేటెస్ట​ షెడ్యూల్‌ కేరళలో ప్రారంభం కానుంది. ఇప్పటికే సామ్‌, విజయ్‌ అక్కడకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను కూడా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. వారం పాటు సాగే ఈ షెడ్యూల్‌లో విజయ్‌, సమంతలపై కీలక సన్నివేశాలను ప్లాన్‌ చేసిందట చిత్ర యూనిట్‌. కాగా ఈ సినిమాను సెప్టెంబర్‌1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

మరిన్ని వార్తలు