Preeti Nigam: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నటి ప్రీతినిగమ్‌

3 Nov, 2022 10:52 IST|Sakshi

కొమ్మాది: రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం సీరియల్‌ నటి ప్రీతినిగమ్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనుభూతి కలిగిందన్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్‌లో బిజీగా ఉన్నానని, పాపే నా జీవనజ్యోతి సీరియల్‌కు మంచి గుర్తింపు వస్తుందని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు