‘ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిలో మార్పులేదు’

20 Aug, 2020 19:50 IST|Sakshi

చెన్నై: గత కొన్నిరోజులుగా కరోనాతో చికిత్స తీసుకుంటున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ స్పష్టం చేశారు. ఎస్పీ బాలు ఆరోగ్యంపై గురువారం ఒక వీడియోలో చరణ్‌ మాట్లాడుతూ.. ‘నిన్నటితో పోలిస్తే మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. మెరుగైన చికిత్స అందిస్తున్నా.. ఆరోగ్య పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పురాలేదు.

మీ ప్రార్థనలు, ఆశీస్సులతో ఆయన మెరగవుతారని భావిస్తున్నాం. మా కుటుంబానికి అండగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. బాలుగారి ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు అడిగితెలుసుకుంటున్న  సినీ పరిశ్రమ, సంగీత పరిశ్రమలోని అందరికీ ధన్యవాదాలు. ఈ సాయంత్రం ఆరు గంటలకు ఎస్పీ బాలు ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నాం’ అని చరణ్‌ తెలిపారు. కాగా, కొన్ని రోజుల నుంచి ఎస్పీ బాలు ఆరోగ్యం విషమంగా ఉండటంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. కాలేయం మినహా అన్ని అవయవాలు పనిచేస్తూ ఉండటంతో బాలు తిరిగి కోలుకుంటారని అంతా ఆశిస్తున్నారు.  


 

మరిన్ని వార్తలు