రేపు కర్నూల్‌లో ‘కొండపొలం’ ఆడియో ఫంక్షన్‌

1 Oct, 2021 19:20 IST|Sakshi

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కొండపొలం’. ఇందులో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎమ్‌ఎమ్‌ కిరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ రోజు విడుదలైన ఈ మూవీలో సెకండ్‌ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో ‘కొండపొలం’ ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ రేపు కర్నూల్‌లో జరగనుందని తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. కర్నూల్‌లోని సంతోష్‌ నగర్ కాలనీలోని కన్వెన్షన్‌ హాల్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా అక్టోబర్‌ 8న ఈ మూవీ థియేటర్లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు