వెంకటేశ్ 'సైంధవ్‌' కొత్త షెడ్యూల్.. అక్కడ షూటింగ్

21 Aug, 2023 04:27 IST|Sakshi

వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్‌’. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్గా నటిస్తున్నారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ కర్ణాటకలోని బీదర్‌లో ప్రారంభమైంది. వెంకటేశ్‌ పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో ఓ యాక్షన్  సీక్వెన్స్ ను ప్లాన్  చేశారట శైలేష్‌ కొలను.

తాజాగా మొదలైన బీదర్‌ షెడ్యూల్‌ ఈ నెలాఖరు వరకూ సాగుతుందట. సెప్టెంబరులో ప్లాన్  చేసిన ఓ విదేశీ షెడ్యూల్‌తో ‘సైంధవ్‌’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని, వినాయక చవితి పండగ సందర్భంగా టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్‌ ఉన్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘సైంధవ్‌’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమాకు సహ నిర్మాత: కిషోర్‌ తాళ్లూరు, సంగీతం: సంతోష్‌ నారాయణ్‌.

మరిన్ని వార్తలు