Vijay Sethupathi: పిశాచి డైరెక్టర్‌తో విజయ్‌ సేతుపతి సినిమా.. కాన్సెప్ట్‌ ఏంటంటే?

26 Nov, 2023 10:01 IST|Sakshi

వైవిధ్య భరిత కథా చిత్రాల నటుడిగా పేరు గాంచిన నటుడు విజయ్‌ సేతుపతి. విభిన్న కథా చిత్రాల దర్శకుడు మిష్కిన్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో చిత్రం అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. విజయ్‌ సేతుపతి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. జవాన్‌ చిత్రంతో పాన్‌ ఇండియా నటుడిగా గుర్తింపు పొందారు. ఇక చిత్తిరం పేసుదడి, అంజాదే, పిశాచి వంటి చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్న దర్శకుడు మిష్కిన్‌. కాగా ఈ రేర్‌ కాంబినేషన్‌లో ఒక చిత్రం రూపొందనుందని సమాచారం.

ఇది ట్రైన్‌ ట్రావెలింగ్‌ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. రైలులో జరిగే కథ కావడంతో దీనికి ట్రైన్‌ అనే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు సమాచారం. జయరాం ప్రతినాయకుడి పాత్రను పోషించనున్నారని.. దర్శకుడు మిష్కిన్‌ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. ఈయన ఇటీవలే డెవిల్‌ అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారారు.

ఇదే విధంగా మిష్కిన్‌ తాజాగా దర్శకత్వం వహించిన పిశాచి 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా కూడా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. నిదిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్ర విజయంపై యూనిట్‌ వర్గాలు చాలా నమ్మకంతో ఉన్నాయి.

చదవండి: ఇంట్రెస్టింగ్‌గా వీకెండ్ ఎపిసోడ్.. హాట్ బ్యూటీ అశ్విని ఎలిమినేట్

మరిన్ని వార్తలు