అచ్చంపేట: అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో చిత్రవిచిత్రమైన తంతు చోటు చేసుకుంటోంది. పలువురు స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ప్రజా ప్రాబల్యంలో అంతగా పరిచయం లేనివారు కూడా రంగంలోకి దిగుతున్నారు. దీంతో వారు ఈ రణరంగంలో సీరియస్గా పోటీ చేసేందుకు వచ్చారా..? లేక వెనకెవరైనా ఉన్నారా..? అని పలు అనుమానాలకు తావు ఇస్తుంది. కాగా కొందరు స్వతంత్రుల నామినేషన్ వెనుక ప్రధాన పార్టీల అభ్యర్థులున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాజకీయ సమీకరణలు కూడా దాగి ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. శుక్రవారం నామినేషన్ల ఘట్టం ముగియడంతో అధికంగా స్వతంత్రులు నామినేషన్లు ఉండటం విశేషం.
పార్టీలకు దీటుగా పోటాపోటీగా
నామినేషన్లు దాఖలు
వివిధ సమీకరణలతో స్వతంత్రులను బరిలోకి దించుతున్న వైనం
ముగిసిన నామినేషన్ల ఘట్టం