ప్రజలందరూ సుఖసంతోషాలతో వెలుగొందాలి

22 Mar, 2023 02:30 IST|Sakshi

నంద్యాల: శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు శుభాలు కలగాలని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజాద్‌ బాషా, జిల్లా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్‌, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, జిల్లా ఎస్పీ కె. రఘువీర్‌ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తదితరులు సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసే పర్వదినం ఉగాది పండుగ అని, జీవన గమనంలో కష్ట సుఖాలు సహజమే అనే సత్యాన్ని ఆరు రుచులు మేళవించిన ‘ఉగాది పచ్చడి‘ తెలియజేస్తుందన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వెలుగొందాలని, అందరి భాగస్వామ్యంతో అభివృద్ధిలో జిల్లా ముందడుగు వేయాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు