ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిన 8 ఏళ్ల బాలుడు

7 Dec, 2022 08:10 IST|Sakshi

భోపాల్‌: ఆడుకుంటూ వెళ్లి ఓ ఎనిమిదేళ్ల బాలుడు 400 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌ జిల్లాలో మంగళవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మండవి గ్రామంలోని ఓ పొలంలో ఇటీవలే బోరు బావి తవ్వారు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆడుకుంటున్న తన్మయ్‌ దియావర్‌(8) అనే బాలుడు ఆ బోరులో పడిపోయాడని ఆత్నేర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జ్‌ అనిల్‌ సోనీ తెలిపారు.

బాలుడిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. బోరు బావి చుట్టూ తవ్వేందుకు ప్రొక్లెయిన్‌ వంటి వాహనాలు చేరుకున్నాయని చెప్పారు. బోరు బావిలోని బాలుడికి ఆక్సిజన్‌ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం బాలుడు 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.

ఇదీ చదవండి: లఖీంపూర్‌ కేసులో 13 మందిపై అభియోగాలు

మరిన్ని వార్తలు