19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌గా, ఎన్‌ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్‌ పోల్‌ రంగంలోకి

27 Oct, 2023 16:04 IST|Sakshi

రెండేళ్ల క్రితమే నకిలీ పాస్‌పోర్ట్‌తో  అమెరికాకు  చెక్కేసిన యోగేష్‌ కాద్యాన్‌ 

 తాజాగా ఇంటర్‌ పోల్‌  రెడ్‌ కార్నర్‌ నోటీసులు  

న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన 19 ఏళ్ల  గ్యాంగ్‌స్టర్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్‌పోల్) రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ ఏసింది.  నకిలీ పాస్‌పోర్ట్‌తో రెండేళ్ల క్రితం అమెరికాకు పారిపోయిన  గ్యాంగ్‌స్టర్ యోగేష్ కాద్యాన్‌పై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం లాంటి అభియోగాలతో తాజాగా ఈ నోటీసు లిచ్చింది. 

యోగేష్ చిన్న వయస్సులోనే ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణుడని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎన్‌డీటీవీ రిపోర్ట్‌ చేసింది. ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌లో ఇతను కూడా చేరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం యుఎస్‌లోని బాబిన్హా గ్యాంగ్‌లో  చేరిన కాద్యాన్‌కు ఖలిస్తానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని, అత్యాధునిక ఆయుధాల వినియోగంలో ఆరితేరిపోయాడనే తీవ్ర ఆరోపణలూ ఉన్నాయి.   (‘‘క్లిక్‌ చేసి వాట్సాప్‌ ఛానెల్‌ ఫాలో అవ్వండి’’)

ఈ నేపథ్యంలోనే  ఇండియాలో  కాద్యాన్‌ ఇల్లు, ఇతర రహస్య స్థావరాలపై ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)దాడులు చేసింది. అలాగే అతని ఆచూకీ తెలిపిన రూ.1.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. తాజాగా ఇంటర్‌పోల్  కూడా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది.

అంతకుముందు, విదేశాలకు పారిపోయాడని భావిస్తున్న మరో గ్యాంగ్‌స్టర్ హిమాన్షు అలియాస్ భౌపై రెడ్ కార్నర్‌ నోటీసు జారీ అయింది. వీరంతా  ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను తొలగించి, అమెరికా, కెనడాలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్టు సమాచారం.  (హెలికాప్టర్‌ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం)

కాగా గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌లో NIA  ఇటీవల వేగం పెంచింది. దీంతోచాలా మంది గ్యాంగ్‌స్టర్లు అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లిపోవడమో, లేదా యోగేష్ కడియన్ మాదిరిగా నకిలీ పాస్‌పోర్ట్‌లతో భారతదేశం నుండి పారిపోయారు. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. ఈ కేసును ఎన్‌ఐఎ దర్యాప్తు చేస్తోంది. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్  ప్రధాన నిందితుడు.  (కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!)

గత నెలలో పంజాబ్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్‌ (సుఖ దునేకే) కెనడాలో  తామే హత మార్చామని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించడంతో అతను ఇటీవల మళ్లీ వార్తల్లో నిలిచాడు. గతంలో కూడా పలు మార్లు బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్‌ను ఈ మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడిన  సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు