Lord Ram: రాముడు దేవుడే కాదు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

15 Apr, 2022 18:35 IST|Sakshi

పాట్నా: దేవుడి విషయంలో ఎవరి నమ్మకాలు వారికి.. కొందరు దేవుడు ఉన్నాడని నమ్మితే.. మరికొందరూ లేడని వాదిస్తారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. రాముడి విషయంలో బీహార్‌ మాజీ సీఎం జితిన్‌ రాం మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

రాముడు అసలు దేవుడే కాదని సంచలన కామెంట్స్‌ చేశారు. అంతటితో ఆగకుండా.. రాముడు అనే పేరు కేవలం ఓ పాత్ర మాత్రమేనని అన్నారు.  ఆ పాత్ర‌ను తుల‌సీదాస్‌, వాల్మీకి త‌మ త‌మ రాత‌ల్లో చొప్పించార‌ని ఆసక్తికర వ్యాఖ్య‌లు చేశారు.  వాల్మీకి రామాయ‌ణం ర‌చించార‌ని, తుల‌సీదాస్ ఇత‌ర ర‌చ‌న‌లు చేశార‌ని, అందులో మంచి విష‌యాలున్నాయ‌ని ఆయన తెలిపారు. ఈ సందర్భంగానే తమ‌కు తుల‌సీదాస్‌, వాల్మీకిపై పూర్తి విశ్వాసం ఉంది కానీ.. రాముడిపై విశ్వాసం లేద‌ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

అంతటితో ఆగకుండా.. దేశంలో రెండే కులాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ధనవంతులు, పేదవాళ్లు అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే రామాయణంలో శ‌బ‌రి ఇచ్చిన ఎంగిలి పండ్ల‌ను రాముడు తిన్నార‌ని పురాణ కాలం నుంచి వింటున్నాం. అయితే, మేము కొరికిన పండ్ల‌ను మీరు(పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి) తిన‌రు, ముట్టుకోరు అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు