‘‘నీపై కోప్పడాలో.. జాలి పడాలో తెలీడం లేదు’’

1 May, 2021 16:39 IST|Sakshi

శానిటైజర్‌ దొంగిలించిన వ్యక్తి

వైరల్‌ వీడియో.. నెటిజనుల విమర్శలు

దొంగతనం అనగానే బంగారం, డబ్బు, విలువైన వస్తువులను చోరీ చేయడం గుర్తుకు వస్తాయి. కానీ కొందరు కక్కుర్తి వ్యక్తులు చేసే చోరీలు చూస్తే వారిపై జాలి పడాలో లేక కోప్పడాలో అర్థం కాదు. ఓ వ్యక్తి చేసిన దొంగతనం చూస్తే మీకు కూడా ఇలానే అనిపిస్తుంది. ఇంతకు ఆ వ్యక్తి చేసిన దొంగతనం ఏంటయ్యా అంటే.. ఏటీఎం సెంటర్‌లో ఉన్న శానిటైజర్‌ డబ్బాను తస్కరించాడు. విన‌డానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. ఏటీఎంలో డ‌బ్బులు తీయ‌డానికి వెళ్లిన ఓ క‌స్ట‌మ‌ర్‌.. అక్క‌డే ఉన్న శానిటైజ‌ర్ బాటిల్‌ను దొంగిలించాడు.

కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం శానిటైజర్‌, మాస్క్‌ వినియోగం తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో పలు దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, ఆఫీసుల ముందర శానిటైజర్లను ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డబ్బులు తీసుకోవడం కోసం ఏటీఎం సెంటర్‌కి వెళ్లాడు. కాసేపు అక్కడే ఉన్న ఆ వ్య‌క్తి.. చుట్టుప‌క్క‌ల ఎవ‌రూ లేక‌పోవ‌డం గ‌మ‌నించి వెంట‌నే శానిటైజ‌ర్ బాటిల్‌ను త‌న బ్యాగులో పెట్టుకుని అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. అక్క‌డే ఏటీఎం సెంట‌ర్‌లోని సీసీ కెమెరాల్లో ఈ త‌తంగ‌మంతా రికార్డ‌వ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. సదరు వ్యక్తిని నెటిజనులు ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. నీ కక్కుర్తి తగలడా.. ఓ ఇరవై రూపాయలు పెట్టి శానిటైజర్‌ కొనుక్కోలేవా అంటూ విమర్శిస్తున్నారు. 

చదవండి: పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్‌

మరిన్ని వార్తలు