భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయం నమోదు చేసింది. బుర్హాన్పూర్ జిల్లాలోని నేపానగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మంజు రాజేంద్ర దాదు 44,805 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి గెందూ బాయి ఓటమి పాలయ్యారు.
మంజు రాజేంద్ర దాదుకు మొత్తం 1,13,400 ఓట్లు పోలవగా సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన గెందూ బాయికి 68,595 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది.