సీబీఐ డైరెక్టర్‌కు సమన్లు

10 Oct, 2021 06:08 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర మాజీ డీజీపీ, సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైశ్వాల్‌కు ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఫోన్‌ట్యాపింగ్, డేటా లీక్‌ వ్యవహారానికి సంబంధించిన కేసులో  ఈ నెల 14న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని  ఈ–మెయిల్‌ ద్వారా జైశ్వాల్‌కు సమాచారమిచి్చనట్లు సైబర్‌ విభాగం పోలీసులు చెప్పారు. మహారాష్ట్రలో పోలీసు బదిలీల్లో అక్రమాల ఆరోపణలపై గతంలో ఐపీఎస్‌ అధికారిణి రష్మీ శుక్లా ఓ నివేదిక తయారు చేశారు. రాజకీయ నాయకులు, సీనియర్‌ అధికారులను విచారిస్తున్న సమయంలో వారి ఫోన్లు ట్యాపింగ్‌ జరిగాయని అనిపించేలా, కావాలనే ఈ నివేదికను లీక్‌ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో జైశ్వాల్‌కు తాజాగా సమన్లు పంపారు.   

మరిన్ని వార్తలు