టార్గెట్‌ ఐసిస్‌..44 చోట్ల ఎన్‌ఐఏ రెయిడ్స్‌

9 Dec, 2023 09:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ లక్ష్యంగా కర్ణాటక,మహారాష్ట్రల్లో ఏకకాలంలో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)రెయిడ్స్‌ చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో  మొత్తం 44 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. 

కర్ణాటకలోని ఒక ప్రాంతంలో మహారాష్ట్రలో 43 చోట్ల ఎన్‌ఐఏ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా దాడులకు ఐసిస్‌ కుట్ర పన్నిందని సమాచారం రావడంతోనే ఎన్‌ఐఏ ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం.ఈ రెయిడ్స్‌లో భాగంగా ఎన్‌ఐఏ ఇప్పటికే 13 మంది దాకా అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

ఇదీచదవండి..అమెరికన్‌ కన్సల్టెన్సీ సర్వే: ప్రధాని మోదీపై కీలక విషయం వెల్లడి..!

>
మరిన్ని వార్తలు