సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. సోనియా గాంధీ తల్లి పోలా మైనో.. ఇటలీలో ఈ నెల 27వ తేదీన కన్నుమూశారు. కాగా, ఆమె అంత్యక్రియలను మంగళవారం(ఆగస్టు 30న) జరిపినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగా, తల్లి అంత్యక్రియలకు సోనియా గాంధీ.. ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది.
Smt. Sonia Gandhi’s mother, Mrs. Paola Maino passed away at her home in Italy on Saturday the 27th August, 2022. The funeral took place yesterday.
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 31, 2022