Ballari: మూడు రోజులు బ్యాంకులు బంద్‌

1 Jun, 2021 08:24 IST|Sakshi

బళ్లారి టౌన్‌: కరోనా నియంత్రణ కోసం మంగళవారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులను బంద్‌ చేయాలని ఆదేశించినట్లు జిల్లాధికారి పవన్‌కుమార్‌ మాలపాటి తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం చేపట్టిన లాక్‌డౌన్‌ వల్ల కరోనా కేసులు తగ్గాయని అన్నారు. కొంత మంది బ్యాంకుల్లో పని ఉందని తిరుగుతున్నారని, దీంతో బ్యాంకులు కూడా బంద్‌ చేస్తే జూన్‌ 7 వరకు చేపట్టిన లాక్‌డౌన్‌ వల్ల మరింత కేసులు తగ్గించవచ్చన్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి జూన్‌ 7 ఉదయం వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సైదూల్‌ అడావత్‌ తెలిపారు.

వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

మరిన్ని వార్తలు