మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. లైవ్​ డిబేట్‌లో ఏం చేసిందో తెలుసా?

20 Jan, 2022 15:33 IST|Sakshi

కోల్‌కతా: సాధారణంగా టీవీ డిబేట్​లలో పాల్గొనడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులను, ఆయా రంగాలకు  ప్రముఖులను ఆహ్వనిస్తుంటారు. కొన్నిసార్లు ఈ డిబేట్​లు ఆసక్తికరంగా సాగితే మరికొన్ని సార్లు ఫన్నీగాను సాగుతుంటాయి. ఈ డిబేట్​లలో పాల్గొనే వక్తలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.

కొన్నిసార్లు లైవ్​ డిబేట్​ల​లో మాటమాట పెరిగి.. సభ్యులు ఒకరిపై మరొకరు దాడిచేసుకొవడం, తిట్ల దండకాన్ని అందుకోవడం మనకు తెలిసిందే. కొన్నిసార్లు ఈ డిబేట్​లలో హద్దులు దాటి కూడా ప్రదర్శిస్తుంటారు.  కొందరు ఎదుటివారి దృష్టిని తమవైపు ఆకర్శించడానికి కొందరు తమ నోటికి పనిచేబితే.. మరికొందరు ఎదుటివారి వాదనలు వినకుండా ఫన్నీగా ప్రవర్తిస్తుంటారు.

తాజాగా.. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పశ్చిమ బెంగాల్​కు చెందిన ఒక టీవీ ఛానెల్​ డిబేట్​లో యాంకర్​, ఐదుగురు సభ్యులు డిబెట్​లో పాల్గొన్నారు. దీనిలో అందరు తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈక్రమంలో డిబెట్​లో పాల్గొన్న ఒక మహిళ తన వంతు కోసం వేచిచూస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది.

అయితే, మిగతా సభ్యులు మాత్రం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దాంతో ఆమె హైడ్రామా క్రియేట్‌ చేసింది. ఆ మహిళ లైవ్​లోనే స్టెప్పులేయడం ప్రారంభించింది. దీంతో పక్కనున్న సభ్యులు మహిళ చర్యపట్ల ఆశ్చర్యంతో ఆమె వైపే చూస్తు ఉండిపోయారు. ఆ మహిళ మాత్రం.. తన రెండు చేతులను వివిధ భంగిమలతో చూపిస్తూ .. వెరైటీగా డ్యాన్స్ చేసింది.

ఆ తర్వాత.. గట్టిగా అరుస్తు వెరైటీగా స్పందించింది. ఈ ఫన్నీ డిబెట్​ గతంలోనే జరిగింది. ఆకుపచ్చని కుర్తీవేసుకున్న మహిళ రోష్నిఆలీ. ఆమె పర్యావరణ వేత్త. తాజాగా, దీన్ని ఎలిజబెత్​ అనే ట్విటర్​యూజర్​ తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. దీంతో మరోసారి ఇది వైరల్​గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్​.. భలే స్టెప్పులేసింది..’, ‘మహిళ ఎవరిని తిట్టలేదు.. బాగా నిరసన తెలిపింది’, ‘ పాపం.. మాట వినకుంటే ఏంచేస్తుంది..’, ‘మా సపోర్ట్​ ఆ మహిళకే..’ అంటూ కామెంట్​లు చేస్తున్నారు. 

చదవండి: మాజీ సర్పంచ్‌ దాష్టికం!..మహిళా ఆఫీసర్‌ని జుట్టు పట్టుకుని, చెప్పుతో కొట్టి... చివరికి

మరిన్ని వార్తలు