Bengal post poll violence: సీబీఐ కేసులు

26 Aug, 2021 14:47 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత  హింసాత్మక ఘటనలపై సీబీఐ కేసులు 

9 కేసులు నమోదు, మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం: సీబీఐ

కోల్‌కతా: ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన హింస‌కు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంఘటనలపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

రాష్ట్ర పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా, తగిన సమయంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని  సీబీఐ పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కేసుల విచారణ నిమిత్తం నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని, బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసేందుకు  రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు పంపినట్లు సీబీఐ అధికారి  ఒకరు చెప్పారు. 

మరిన్ని వార్తలు