పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

18 Nov, 2023 01:22 IST|Sakshi
జాబితాను పరిశీలిస్తున్న పరిశీలకులు గౌతమ్‌సింగ్‌

సిరికొండ : మండల కేంద్రంతో పాటు న్యావనంది, పాకాల గ్రామాల్లో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు గౌతమ్‌సింగ్‌ శుక్రవారం పరిశీలించారు. కేంద్రాల వద్ద సౌకర్యాలపై ఆరా తీశారు. పోలింగ్‌ రోజు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని స్థానిక అధికారులను ఆయన ఆదేశించారు. ఉప తహసీల్దార్‌ ప్రవీణ్‌, మునీరొద్దీన్‌ ఉన్నారు.

ధర్పల్లిలో..

ధర్పల్లి : త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మండలంలోని దుబ్బాక, రేకులపల్లి, డీబీ తండాలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గల జనరల్‌ అబ్జర్వర్‌ గౌతమ్‌ సింగ్‌ (ఐఏఎస్‌) శుక్రవారం పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇ బ్బందులు కలవకుండా తాగునీరు, ర్యాంప్‌, విద్యు త్‌ సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశించా రు. తహసీల్దార్‌ మాలతి, సీఐ సైదా, ఎస్సై వంశీకృష్ణ రెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు