విద్యుత్‌ షాక్‌తో మహిళ మృతి

26 Mar, 2023 01:42 IST|Sakshi

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): కరెంటు షాక్‌కు గురై వివాహిత మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఘటనపై మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భీమనవారిపేట విశ్వ

బ్రాహ్మణ వీధిలో ఖదీర్‌, మహిమూద్‌ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. ఖదీర్‌ ఆటో నడుపుకుని జీవనం సాగిస్తుంటాడు. శనివారం తెల్లవారుజామున నిద్ర లేచిన ఖదీర్‌ ఆటో కిరాయిలకు వెళ్లాడు. ఉదయం 8 గంటల సమయంలో చిన్న కుమారుడు షబ్బీర్‌ తండ్రికి ఫోన్‌ చేసి తల్లి మహిమూద్‌ (51) ఇంటి వరండాలో ఉన్న మెటారుకు ఉన్న ఐరన్‌ పైపు పట్టుకుని కింద పడి ఉందని , వెంటనే మెయిన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి వచ్చి తల్లిని చూడగా, ఉలుకు పలుకు లేకుండా ఉందని చెప్పాడు. దీంతో వెంటనే ఇంటికి వచ్చిన ఖదీర్‌ భార్యను అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. వైద్యులు మహిమూద్‌ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు