సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి బుధవారం సాయంత్రం ఏపీకి వచ్చారు. రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అమరావతిలో నిర్వహిస్తున్న నిరసనలు సోమవారానికి 300వ రోజుకు చేరుకోనున్నాయి.
ఈ సందర్భంగా సోమవారం ఆన్లైన్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు చివరిసారిగా ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు బెయిల్పై విడుదలైనప్పుడు ఆయన్ని పరామర్శించేందుకు విజయవాడకు వచ్చారు. 2 రోజులు ఉండి మళ్లీ హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు.