ఠాక్రేకు టీపీసీసీ వీడ్కోలు త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్న మున్షీ  

25 Dec, 2023 00:16 IST|Sakshi
ఠాక్రేకు వీడ్కోలు పలుకుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు మహేశ్‌ కుమార్‌ గౌడ్, వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి అధిష్టానం తప్పించిన నేపథ్యంలో మాణిక్‌ రావ్‌ ఠాక్రే తన సొంత రాష్ట్రా నికి వెళ్లిపోయారు. గోవా ఇన్‌ చార్జిగా నియమితులైన ఆయన కు ఆదివారం ఎమ్మెల్యే క్వార్ట ర్స్‌లో పలువురు టీపీసీసీ నేత లు కలిసి అభినందనలు తెలి పారు.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షులు హర్కర వేణు గోపాల్, అంజన్‌కుమార్‌ యాదవ్, వేం నరేందర్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, ఏఐసీసీ సభ్యుడు ఎం.ఎ.ఫహీం, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు భూపతిరెడ్డి నర్సారెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌ ఆయనను కలిసి వీడ్కోలు పలికారు.  ఠాక్రేకు టీపీసీసీ పక్షాన జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలోనే మహారాష్ట్ర కు వెళ్లినట్టు కాంగ్రెస్‌ వర్గాల ద్వారా తెలిసింది. కొత్త ఇన్‌చార్జిగా నియమితులైన దీపాదాస్‌ మున్షీ త్వర లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు