టీడీపీ కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్‌

29 Oct, 2023 19:59 IST|Sakshi

అమరావతి: టీడీపీ నిర్వహించిన కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్‌ అయింది. చంద్రబాబుకు సంఘీభావంగా కళ్ళుకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టాలని లోకేష్ పిలుపు నిచ్చినప్పటికీ.. ప్రజలు, టీడీపీ క్యాడర్ పట్టించుకోలేదు. ఇళ్లల్లో నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు బయటికి కూడా రాలేదు.

చంద్రబాబు సంఘీభావ కార్యక్రమాలు వరుసగా అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాలు ఇప్పటికే అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఫోటోలకు పోజులు కోసం కొంతమంది టీడీపీ సంఘీభావం పేరుతో డ్రామాలు చేస్తున్నారు. 

ఇదీ చదవండి: ‘లోకేష్‌ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది’

మరిన్ని వార్తలు