-
స్కిల్ కేసులో నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ, సాక్షి: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న స్కిల్ డెవపల్మెంట్ స్కాం కేసు ఇవాళ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో అరెస్టై 53 రోజులపాటు జైల్లో గడిపిన చంద్రబాబు.. బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలంటూ నేర పరిశోధన విభాగం(CID) వేసిన పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ విచారణ జరపనున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారన్నది సీఐడీ వాదన. అంతేకాదు.. రెడ్బుక్ పేరుతో అధికారుల్ని ఆయన తనయుడు నారా లోకేష్ సైతం విచారణ అధికారుల్ని బెదిరిస్తున్నాడన్నది మరో అభియోగం. ఈ రెండింటిపైనా సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగుతోంది. ఇదిలా ఉంటే.. బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని గత విచారణలో చంద్రబాబుకు సుప్రీం కోర్టు వార్నింగ్ సైతం ఇచ్చింది.ఇదీ చదవండి: స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీం వార్నింగ్గత విచారణలో సందర్భంగా.. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ వాదిస్తూ.. ‘‘చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్లు స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారు. దర్యాప్తునకు భంగం కలిగేలా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. రెడ్ బుక్ లో అధికారులు పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల అంతు చూస్తాను అని లోకేష్ బెదిరిస్తున్నారు. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు అని వాదించారు. దీంతో.. రెడ్ బుక్ అంశంపై దాఖలు చేసిన అప్లికేషన్ రికార్డులలో ఉంచాలని రిజిస్ట్రీని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. -
స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీంకోర్టు వార్నింగ్ !
-
స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీంకోర్టు వార్నింగ్ !
ఢిల్లీ,సాక్షి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్లతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం(ఏప్రిల్ 16) విచారణ జరిపింది. పిటిషన్ తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. బాబు, ఆయన కుమారుడు లోకేష్ స్కిల్ కేసు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ తరపు న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చారు. ‘దర్యాప్తుకు భంగం కలిగేలా లోకేష్ వ్యవహరిస్తున్నారు. రెడ్బుక్లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల అంతు చూస్తాను అని లోకేష్ అంటున్నారు. ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ బెదిరింపులకు పాల్పడ్డాడు. రెడ్బుక్ చంద్రబాబుకు ఇస్తారా అని లోకేష్ను ఆ టీవీ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూలో అడిగారు’ అని సీఐడీ వాదనలు వినిపించింది. పిటిషన్పై చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కాగా, గతేడాది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. శిరోముండనం కేసులో విశాఖ కోర్టు కీలక తీర్పు -
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ
సాక్షి, ఢిల్లీ: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. కాగా, స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లో చంద్రబాబు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ పేర్కొంది. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందన్న అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ ప్రధానం పిటిషన్లో తెలిపింది. -
‘స్కిల్’ కేసులో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాల్సిందేనని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్ షరతుల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించింది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అధికారులను బెదిరిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చింది. వచ్చే ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తామని.. ఆ తర్వాత చంద్రబాబు కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్నారని నివేదించింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక స్కిల్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ఏపీ సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇలా చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేది జోక్యం చేసుకొని రికార్డుల్లో లేని అంశాలను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. దీంతో చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రకటనలకు సంబంధించి అదనపు డాక్యుమెంట్లు అందజేయడానికి ఏపీ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహత్గి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ ఏం కోరుకుంటోందని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించగా.. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని రోహత్గి విన్నవించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తోందని, ఈ సమయంలో బెదిరింపు ప్రకటనలను తేలిగ్గా తీసుకోరాదని తెలిపారు. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన అప్పీల్ కోర్టు ముందుందన్నారు. నిందితుడి కుటుంబ సభ్యుడి తీరు దిగ్భ్రాంతికరంగా ఉందని.. అధికారుల పేర్లన్నీ ఒక పుస్తకంలో రాస్తున్నట్లు చెబుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వీరి పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున బెదిరింపు ప్రకటనలు చేసేవారికి బెయిల్ ప్రయోజనం, స్వేచ్ఛ లభించకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ సీఐడీ అనుబంధ పిటిషన్పై స్పందించడానికి తమకు సమయం కావాలని కోరారు. దీంతో రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అవసరమనుకుంటే పిటిషనర్ కూడా స్పందించవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement