వరద బాధితులను ఇలా పరామర్శిస్తారా? 

22 Jul, 2022 05:00 IST|Sakshi

చంద్రబాబుపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం  

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్‌ షోలో అసలు వరద గురించిన ప్రస్తావనే లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ముంపు గ్రామాలకు వెళ్లిన చంద్రబాబు వరద బాధితుల గురించి కాకుండా.. శ్రీలంక గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. దారి పొడవునా ఆయన డప్పు తప్ప ఏం లేదన్నారు. ఈ విధంగా ఎవరైనా వరద బాధితులను పరామర్శిస్తారా అని అప్పిరెడ్డి ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు