‘స్కిల్‌’లో చంద్రబాబు దోపిడీ

18 Sep, 2023 05:34 IST|Sakshi

బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టుకుని పవన్‌ జైల్లో డీల్‌ మాట్లాడుకున్నాడు

తండ్రిని బయటకు తెచ్చుకునేందుకే లోకేశ్‌ ఢిల్లీ యాత్ర: మంత్రి కాకాణి

నెల్లూరు(దర్గామిట్ట): మాజీ సీఎం చంద్రబాబు తన నైపు­ణ్యాన్ని ప్రదర్శించి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో రూ.371 కోట్లు దోచుకున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని వైఎస్సార్‌­సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ నిర్మాతల వద్ద రెమ్యూ­న­రేషన్‌ తీసుకుని కెమెరాల ముందు మాట్లాడిన విధంగానే చంద్రబాబు దగ్గర ప్యాకేజ్‌ తీసుకుని ప్రజల ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నా­రని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు, లోకేశ్‌ల­పై నమ్మకం లేక బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టు­కుని జైల్లో డీల్‌ కుదుర్చుకు­న్నారని మండిపడ్డారు.

కేంద్రంలోని నాయకుల కాళ్లమీద పడి తన తండ్రిని బయటకు తెచ్చుకునేందుకు లోకేశ్‌ ఢిల్లీలో గడప గడపకు తిరుగుతున్నా­డని అన్నారు. గతంలో అనేక కేసుల్లో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేసి, కోర్టులకు వెళ్లి సాంకేతిక కారణాలు చూపించి స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం చంద్ర­బాబు అక్రమాలపై కోర్టు­లకు కూడా స్పష్టత వచ్చిందన్నారు. చంద్రబాబు బయ­టకు వచ్చే అవకా­శాలు ఉన్నాయా.. అని టీడీపీ శ్రేణులే అనుకుంటున్నా­యని, చివరకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా బాబు పనైపోయిందని మాట్లాడుతున్నారని చెప్పా­రు.

వీటన్నింటినీ పరి­శీలిస్తే చంద్రబాబు అవి­నీతికి పాల్పడ్డారని టీడీపీ క్యాడర్‌కు కూడా అర్థమైందని తెలుస్తోంద­న్నారు. తన భార్య ఆస్పత్రిలో ఉన్నారని రాజమ­హేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ సెలవు పెడితే పచ్చ మీడియా ప్రజలను రెచ్చ­గొట్టేలా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబాల­కు మేలు జరి­గితేనే తమకు ఓటు వెయ్యాలని సీఎం జగన్‌ ధైర్యంగా చెబుతున్నారని, కానీ చంద్ర­బాబు మాత్రం ఎవరో ఒకరితో పొత్తులు పెట్టు­కుని ప్రజ­లను బలి చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తలు