మా టార్గెట్‌ అదే.. మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

7 Oct, 2022 13:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలే తమ టార్గెట్‌ అని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఈ దేశానికి గుదిబండ. 2024 తర్వాత కాంగ్రెస్‌ కనుమరుగయ్యే ఛాన్స్‌. ప్రధాని అసమర్థుడు, చేతకాని వారు’’ అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. చెప్పినవి ఏమీ ప్రధాని చేయలేదు. ఈడీ, సీబీఐ, ఐటీలను వేటకుక్కలుగా బీజేపీ వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు.
చదవండి: మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ 

మరిన్ని వార్తలు