‘పచ్చ దొంగల ముఠా ఊళ్ళమీద పడుతోంది జాగ్రత్త’

21 Nov, 2023 16:28 IST|Sakshi

మోసం చేయడంలో టీడీపీ కొత్త టెక్నిక్

వారెంటీ లేని గ్యారెంటీలతో ఇంటింటికీ వస్తున్న టీడీపీ

అంతర్జాతీయ దొంగల ముఠాకు..  టీడీపీకి తేడా లేదు

యాప్ పేరుతో ప్రజల డేటాను దొంగలిస్తున్నారు

మాయల పకీరు చేతిలో ప్రజల డేటా.. తస్మాత్‌ జాగ్రత్త

రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల

తాడేపల్లి: పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్లలోకి చొరబడుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అంతర్జాతీయ దొంగల ముఠాలకు ఆ పార్టీ ఏ మాత్రం తీసిపోదని టీడీపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు సజ్జల. పచ్చ దొంగల ముఠాతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు 

'పచ్చ దొంగల ముఠా ఊళ్ల మీద పడుతోంది. ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్స్‌ టీడీపీకి బాగా తెలుసు. చంద్రబాబుకు అమలు చేయాలనే ఉద్దేశం లేని హామీలు ఇచ్చారు. హామీల అమలు ఎక్కడని ప్రశ్నిస్తారని వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. ఓటర్‌ ఐడీకార్డు తీసుకుని ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. రాత పూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో.. మరి దీనిని ఏమంటారు. 5 కోట్ల మంది ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తూ నిలువు దోపిడీకి ప్రయత్నాలు చేస్తున్నారు.' అని దుయ్యబట్టారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే..

అంతర్జాతీయ దొంగల ముఠాకు తీసిపోని టీడీపీ

  • నాలుగైదు దశాబ్ధాల క్రితం ఒక రకమైన మోసాలు జరిగితే..జనరేషన్‌ పెరిగి, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ మోసాలు రూపు మారాయి. 
  • టెక్నాలజీని ఉపయోగించి నిలువు దోపిడీ చేయడం, ప్రలోభపెట్టడం, ఎన్ని చట్టాలున్నా వాటిని ఏదో రకంగా ఉల్లంఘించడం రోజూ చూస్తూనే ఉన్నాం. 
  • అలాంటి మోసాలు ఎల్లలు దాటి విదేశాల నుంచి కూడా మోసాలు జరుగుతున్నాయి. 
  • విదేశీ లాటరీ కోట్లు తగిలింది..బ్యాంకు ఎకౌంట్‌ ఓపెన్‌ చేయాలంటూ మోసాలు చేసేవారు ఒకరైతే..
  • రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ అంతర్జాతీయ దొంగల ముఠాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఒంటిమీద బట్టలతో సహా నిలువు దోపిడీ చేయగల కెపాసిటీ ఉన్న దొంగల పార్టీగా టీడీపీ తయారైంది. దాని వల్ల జరిగే ఘోరం, దారుణం ఊహలకు అందదు. 
  • అలాంటి లక్షణాలున్న రాజకీయ పార్టీగా తెలుగుదేశానికి  ప్రజలను మోసం చేయడం ఎలాగూ అలవాటే. 
  • కానీ మోసం చేయడంలోనూ కొత్త కొత్త టెక్నిక్‌లను వినియోగించి మళ్లీ ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు ఆ పార్టీ తెగబడిన తీరు ఈ మధ్య బయటపడింది. 
  • పచ్చ దొంగల ముఠా ఊళ్లమీదొచ్చి పడుతోంది..జాగ్రత్త!
  • పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్లలోకి చొరబడుతోంది జాగ్రత్త!
  • ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గ్రహించాలి.. టీడీపీ ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని మా సూచన.

లక్షలు వచ్చినట్టు కంగ్రాట్స్‌ చెప్తూ వ్యక్తిగత డేటా చోరీ

  • ఇటీవల రాజంపేటలో రెండు సంఘటనలు జరిగాయి. 
  • అసలు టీడీపీ వారి మేనిఫెస్టో ఏంటో కూడా ఇంకా పూర్తిగా తెలియదు..
  • ఏదో సూపర్‌ సిక్స్‌ అన్నారు...దత్తపుత్రుడు చెప్పినవి కలిపి 11 హామీలు అంటున్నారు. 
  • 2014లో మోడీ, పవన్‌ కల్యాణ్‌ హామీలతో తెచ్చిన మేనిఫెస్టోనే చంద్రబాబు వెబ్ సైట్ నుంచి మాయం చేశాడు. 
  • అలాంటిది మేనిఫెస్టోపైనే స్పష్టత లేని నేపథ్యంలో హామీల పేరుతో ఇప్పుడు ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. 
  • టీడీపీ కార్యకర్తలు.. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి డేటా తీసుకుని ఒక యాప్‌లో ఎంటర్‌ చేస్తున్నారు. 
  • ఓటీపీ వస్తే..క్లిక్‌ చేయమంటున్నారు. దాన్ని క్లిక్‌ చేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కార్డు వస్తోంది. 
  • దాంట్లో కంగ్రాట్స్‌ చెప్పి.. 2024 జూన్ నుంచి రూ. 2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారు. 2024 జూన్‌నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమచేయడం ప్రారంభం అవుతుందని చెప్తున్నారు. 
  • అంతటితో ఆగటంలేదు...చంద్రబాబు సంతకం చేసిన ఒక గ్యారెంటీ పత్రాన్ని ఇస్తున్నారు. 
  • చంద్రబాబే అధికారంలోకి వచ్చేసినట్లు ప్రతిజ్ఞ చేస్తూ సంతకం చేసి మరీ ఇస్తున్నాడు. 
  • దీంట్లో ఓటరు కార్డు నంబరు, మొబైల్‌నంబర్‌ తో సహా  అన్ని వివరాలు సేకరిస్తున్నారు. 
  • మరో ఇంటికి వెళ్లి రూ. 6.90లక్షల వస్తుందని, అర్హత సాధించిందని చెప్పుకొచ్చారు. 
  • ఈ కార్యక్రమాన్ని చాపకింద నీరులా టీడీపీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. 
  • ఒక వేళ చెప్పింది ఏదన్నా చేసే వారయినా ఇంటికి వెళ్లి చెప్పవచ్చు. 
  • చెప్పింది రాతపూర్వకంగా ఇచ్చేదే మేనిఫెస్టో..అధికారంలోకి వస్తే దాన్ని అమలు చేసేదే మేనిఫెస్టో. 
  • అలా చేయలేకపోతే ముఖం చూపించలేని పరిస్థితి వస్తుంది. టీడీపీ గతంలో ఇదే మోసం చేసింది. 

లేని మేనిఫెస్టోతో డేటా చోరీ

  • అసలు అమలు చేసే ఉద్దేశ్యమే లేని చంద్రబాబు ఇలాంటి హామీలు గతంలో ఎన్నో ఇచ్చాడు.ఏ ఒక్కటీ అమలు చేయలేదు. 
  • గతంలో ఆయన తన మేనిఫెస్టోనే వెబ్‌సైట్‌ నుంచి తీసేయడమే ఇందుకు నిదర్శనం. 
  • ఇప్పుడు లేని మేనిఫెస్టోను తీసుకుని మళ్లీ ప్రజల వద్దకు వెళ్తున్నాడు. 
  • అసలు మేనిఫెస్టో ఇచ్చే అర్హతే చంద్రబాబుకు లేదు. అలాంటిది ఎలాంటి ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తున్నాడు. 
  • ఏదో నాలుగైదు పాయింట్లు తీసుకుని ఇంటింటికి వెళ్లి మీకు పథకాలు వచ్చేశాయి...కంగ్రాట్స్‌ అంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. 
  • వారెంటీ లేని గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తున్న ఇతన్ని ఏ చట్టం ప్రకారం శిక్షించవచ్చో ప్రజలే ఆలోచించాలి. 
  • ఇది సైబర్‌ క్రైంకి కిందకు వస్తుంది...ఓటరు కార్డు కూడా తీసుకుని పౌరుల ప్రైవసీలోకి కూడా ఎంటర్‌ అవుతున్నాడు. 
  • ముఖ్యంగా ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కిందకు కూడా వస్తుంది. 
  • ఓటరు కార్డు తీసుకుని దాని నుంచి ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ని ఉల్లంఘిస్తున్నాడు. 
  • ప్రజలకున్న ప్రాథమిక హక్కుల్లోకి కూడా వెళ్లిపోతున్నాడు. 

చంద్రబాబు ముఠా 5 కోట్ల మందిని టార్గెట్‌ చేసింది

  • దీనినిబట్టి చూస్తే.. ఒక అంతర్జాతీయ దొంగల ముఠాకు, చంద్రబాబుకు తేడా ఏమైనా ఉందా? 
  • కనీసం వాళ్లన్నా ఒకర్ని టార్గెట్‌పెట్టుకుని లక్షో,పదిలక్షలో కొట్టేయాలని చూస్తుంటారు. 
  • కానీ చంద్రబాబు 5 కోట్ల మందిని మోసం చేస్తున్నాడు. 
  • అసలు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే నీకు, లేని అంశాలను తీసుకొచ్చి ఊహల్లో లెక్కలేసి బూటకపు హామీలిస్తున్నాడు. 
  • ఇది ఏ చట్టం కిందకు వస్తుందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 
  • పచ్చి అబద్ధాలను తీసుకుని ఇళ్లలోకి వచ్చి ప్రజల రహస్యాలను తస్కరిస్తున్నారు. 
  • ఈ డేటాను వారు ఎందుకైనా వాడుకోవచ్చు. బ్లాక్‌ మెయిల్‌ చేయవచ్చు..ఇంకేదైనా చేయవచ్చు. 
  • ఇంత చేస్తున్న చంద్రబాబు గత చరిత్ర చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. 
  • చంద్రబాబు హయాంలో ప్రజలకు చేసిన మంచేమీ లేక ఏకంగా తనకు సరిపడని వైఎస్సార్సీపీ ఓట్లు తీయించడానికి తెగించాడు. 
  • అప్పట్లో సేవామిత్ర అనే ఒక యాప్‌ ను తయారు చేసి ప్రత్యర్థి పార్టీ ఓట్లపై దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు. 
  • బ్లూ ఫ్రాగ్‌ అనే కంపెనీకి పబ్లిక్‌ డేటాకు యాక్సెస్‌ ఇచ్చి, దాని ద్వారా ఐటీ గ్రిడ్స్‌కి పంపారు. 
  • ఆనాడు ఎన్నెన్నో ఉల్లంఘనలు చేశాడు. ఓటరు డేటా అంతా కలెక్ట్‌ చేశాడు. 
  • కుటుంబ ఆర్థిక వివరాల నుంచి మొబైల్‌ నంబర్, కుల వివరాలు, వృత్తి, విద్యార్హత వివరాలు కూడా ఆనాడు సేకరించారు. 
  • ఆనాడు అధికారంలో ఉండి సేవామిత్ర ద్వారా ఇలా అడ్డగోలుగా ఏమేం చేశారనే దానికి ఆధారాలున్నాయి. 
  • అన్ని వివరాలు తీసుకుని ఎన్నికల కమిషన్‌ వారి వద్ద ఉన్న ఫోటోలతో సహా అన్ని వివరాలు సేకరించారు. 
  • ఒక వైరస్‌లా దూరి ప్రజల డేటా అంతా సేకరించి ఆ వివరాలను బూత్‌ కమిటీలకు పంపించారు. 
  • మీరు ఏ పార్టీ అని అడుగుతారు..ఏ పార్టీకి మీరు ప్రిఫరెన్స్‌ ఇస్తారో, ఓటరు కులం అన్నీ సేకరించారు. 
  • ఆనాడు ఎలిమినేషన్‌ ప్రాసెస్‌లోకి వెళ్లాడు. పవన్‌ కల్యాణ్‌ను ప్రభుత్వ ఓటు చీల్చమని చెప్పాడు. 
  • సేవామిత్రలను వ్యతిరేక ఓటును తీసేయండని పంపాడు. 
  • అలా 2017కల్లా ఆయన 50 లక్షల ఓట్లు తీసేయించాడు. 
  • అప్పట్లో మా నాయకుడు జగన్‌ గారి నాయకత్వంలో మేం గవర్నర్, సీఈసీని కూడా కలిసి సాక్ష్యాలు చూపించాం. 
  • మళ్లీ మేం ప్రాసెస్‌ చేసి, 30 లక్షల ఓట్లు మళ్లీ తెచ్చుకోగలిగాం కాబట్టి సరిపోయింది. 
  • ఒక వేళ చంద్రబాబు కోరుకున్నట్లు ఎలిమినేషన్‌ జరిగితే ఏం జరిగి ఉండేది..? 
  • సాక్షి చదివితే...వెంటనే ఫాం 7 దరఖాస్తు చేసేలా పథకం ప్రకారం కుట్ర చేశారు. 
  • అతని ఆలోచనలు ఎంతటి వికృతమైనవో, ఒళ్లంతా నరనరాన అక్రమం, మోసం, వెన్నుపోటు లక్షణం అతనికి ఉన్నాయి. 
  • ఏ లక్షణాలైతే మనిషికి ఉండకూడదో అన్నీ ఉన్న వ్యక్తి ఒక రాజకీయ పార్టీని నడిపితే ఆ దౌర్భాగ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నాం. 
  • ఆనాడు ఎలిమినేషన్‌ చేసిన ఈయన ఇప్పుడు ప్రతిపక్షంలోకి రావడంతో ఓటర్ల వద్దకు వెళ్లి అబద్ధపు హామీలతో ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. 
  • ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమే కాదు..అడ్డంగా ప్రజల్ని మోసం చేసి వాళ్లకు భవిష్యత్తు లేకుండా, మళ్లీ చీకట్లలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. 
  • ఇది మామూలు దొంగతనం, దోపిడీ కంటే మరింత భయంకరమైనది. 

మాయల పకీరు చేతిలో డేటా.. తస్మాత్‌ జాగ్రత్త

  • దీంట్లో మరో కోణం కూడా ఉంది. చంద్రబాబు వద్ద ఆనాడు తీసుకున్న డేటా ఉంది. 
  • కులపరంగా,పార్టీ ప్రిఫరెన్స్‌ వారీగా అతని వద్ద డేటా ఉంది. ఇంకా ఏమేం డేటా అతని వద్ద ఉందో తెలియదు. 
  • ఇప్పుడు మళ్లీ వెళ్లి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం వ్యక్తిగత గోప్యతను తన చేతిలో పెట్టుకుంటున్నాడు. 
  • మాయలపకీరు చేతులోకి డేటా అంతా వెళ్లే డేంజర్‌ పరిస్థితి ఇది. ఇది చిన్న ప్రమాదం కాదు. 
  • మా పార్టీ నుంచి మేం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం. 
  • అతని ఆలోచనే వంకర..ఎదుటి వారిని మోసగించడంలోనే ఆనందం ఉందనుకునే చంద్రబాబు లాంటి వారితో అప్రమత్తంగా ఉండాలి. 
  • నిజంగా తెలియక వీళ్లు చెప్పే వాటికి ప్రజలు భ్రమలోకి వెళితే 2014–19 మధ్యలో ఏం జరిగిందో ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. 
  • నిలువుదోపిడీ చేయగల బందిపోటు దొంగే..ఎదుటి వాళ్లను దొంగ.. దొంగ అని అరుస్తున్నాడు. 

రామోజీరావుకు ఒళ్లంతా పసుపే...ఈనాడు చంద్రబాబు కరపత్రం:

  • చంద్రబాబు సేవలో తరిస్తూ,  ఎల్లో మీడియా చేస్తున్న అఘాయిత్యం పట్ల కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. 
  • వీళ్లు తయారు చేసిన తోలు బొమ్మలు ఏదో ఒక సంస్థ పేరు చెప్పుకుని చేస్తున్న డ్రామాలను కూడా గమనించాలి. 
  • ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, విద్యావంతులు, మేధావులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 
  • మోసం చేస్తున్నది వాళ్లు..ఉల్టా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. 
  • లక్షల ఓట్ల తొలగింపు అంటూ ఈనాడు బ్యానర్‌ వార్తలు రాస్తారు. 
  • 5.78 లక్షలు వలసలు వెళ్లిపోయారు అంటూ రాసుకొచ్చారు. 
  • వివరాల్లోకి వెళితే...ఆ ఓట్లు షిప్టింగ్‌ అయ్యాయని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. 
  • ఈ 5.78 లక్షల ఓట్లు ఒక చోట డిలేట్‌ చేస్తే..వాటిని షిప్టింగ్‌ ప్రకారం వేరే చోట నమోదు చేశారని ఎన్నికల కమిషన్‌ చెప్తోంది. 
  • ఎవడైనా నిష్పక్షపాతంగా రాసేవాడైతే ఆ విషయాన్ని కూడా రాయాలి కదా..? 
  • రామోజీరావు ఒళ్లంతా పసుపే...ఈనాడు చంద్రబాబు కరపత్రం..
  • దానికి మించి చంద్రబాబుకు ఈనాడు రామోజీరావు రాజగురువు. 
  • పచ్చిగా నేను చంద్రబాబును సపోర్ట్‌ చేస్తున్నాను..అని ఇలాంటివి రాసుకోవాలి. 
  • కుప్పం ఓటర్ల జాబితాలో కనికట్లు అంటూ మరో వార్త రాశారు. 
  • సత్యనారాయణరెడ్డి, షఫీయుల్లా అనే పేర్లు చెక్‌ చేయిస్తే అసలు విషయం తెలిసింది. 
  • సత్యనారాయణరెడ్డి లేడట..కానీ ఓటర్ల లిస్టులో ఉందని రాశారు. 
  • షఫీయుల్లా ఓటు విషయంలోనూ అదే విధంగా రాశారు. 
  • చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ ఆ ఓటు ఉంది...ఇప్పుడు కూడా అదే ఓటు కంటిన్యూ అవుతోంది. 
  • మేం అడుగుతుంది కూడా అలాంటి ఓట్లు తొలగించాలనే. 
  • ఇందులో జగన్మోహన్‌రెడ్డి గారిది కానీ, ప్రభుత్వానికి కానీ ఏం రోల్‌ ఉంటుంది..? 
  • అసలు ఓటర్లకు సంబంధించి ప్రభుత్వం రోల్‌ ఎందుకుంటుంది..? 
  • కానీ చంద్రబాబుకు మాత్రం సంబంధం ఉంటుంది..ఎందుకంటే అడ్డదారుల్లో ఎలా అధికారంలోకి రావాలనే లక్షణం ఉంది కాబట్టి వాస్తవాలు చూపించాం. 
  • గత రెండున్నర నెలలుగా రోజూ బ్యానర్‌ హెడ్డింగ్‌ లు పెడుతూ..  ఇలా ఓటర్ల మీదే రాస్తున్నారు. 
  • దొంగే.. దొంగ, దొంగ అని అరిచినట్లు, అడ్డంగా హత్యలు చేసే హంతకుడే విక్టిమ్‌ కార్డు ప్లే చేసినట్లు వ్యవహరిస్తున్నారు. 
  •  ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూడా హత్య చేస్తున్నారు. 
  • రాజకీయం అంటేనే విలువలు లేవు అన్నట్లు, పైకి మాత్రం ప్రతివతల్లా ఇలా అడ్డగోలు రాతలు రాస్తున్నారు. 
  • ఎవరూ లోతుగా విశ్లేషించరులే అని బాబుకు అనుకూలంగా రాసేస్తున్నారు. 
  • బతికున్న వారిని కూడా చనిపోయారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు
  • మరో వైపు 50 లక్షలు ఓట్లు తీసేయాలంటూ యాగీ చేస్తున్నారు. 
  • బతికి ఉన్న వాళ్లని కూడా చనిపోయారని ఫిర్యాదు చేసి ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. 
  • రోజూ మెమెరాండం తీసుకుని ఎన్నికల కమిషన్‌కు ఇస్తూ పోతున్నారు. 
  • ఒక మెషిన్‌లా తప్పుడు దారుల్లో మిస్‌లీడ్‌ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 
  • 2014–19 మధ్యలో ఓటర్ల విషయంలో జరిగిన దానికంటే ఇప్పుడు మరిన్ని దారుణాలకు పాల్పడుతున్నారు. 
  • బరితెగించి చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలు చేసేవేమీ కాదు..గతంలో ఏం చేశాడో అందరూ చూశారు. 
  • వాళ్లు వస్తే గతంలో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమైందని, 12 సిలిండర్లు ఎక్కడ అని, నిరుద్యోగ భృతి ఎక్కడ అని ప్రశ్నించాలి. 
  • మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కొత్త హామీలతో వస్తున్నావు అని ప్రజలు ప్రశ్నించాలి. 

సిటిజన్స్‌ ఫర్‌ డెమెక్రసీ పేరుతో తప్పుడు కేసులు

  • తప్పుడు ఆలోచనల నుంచి దానికి అవసరమైన పరిస్థితులను కల్పించి...వాటిని సిటిజన్స్‌ ఫర్‌ డెమెక్రసీ వంటి సంస్థలను సృష్టించి ముందుకు వెళ్తారు. 
  • నిమ్మగడ్డ రమేష్‌ లాంటి వారు ఇలాంటి సంస్థలు పెట్టి సుప్రీం కోర్టులో కేసులు వేస్తారు. 
  • నేను వాళ్లనే అడుగుతున్నా...మీరు చంద్రబాబు చేస్తున్న దానికి ఏం సమాధానం ఇస్తారు? 
  • అప్పట్లో ఇదే సుబ్రహ్మణ్యమే చీఫ్‌ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఆనాడు జరిగింది ఆయనకు తెలియదా? 
  • ఈ సంస్థ వాలంటీర్లపై సుప్రీం కోర్టుకు వెళ్లింది. 
  • అసలు వాలంటీర్లను ఎవరు దించుతున్నారు..ఎందుకు వస్తారు..? 
  • వాలంటీర్‌ అనే వ్యక్తి వైఎస్సార్సీపీ పాలనలో చివరి మజిలీగా పనిచేస్తున్నారు. 
  • వారు ఉద్యోగులు కాదన్న విషయం వారికీ తెలుసు..వారు ఉద్యోగులు కాకపోతే వాళ్లేం చేస్తారు..? 
  • రాజకీయంగా వాలంటీర్‌ ఎవరికైనా మద్దతు పలకవచ్చు..అది అతని స్వేచ్ఛ.
  • జన్మభూమి కమిటీలకున్న అధికారాలు వీళ్లకి లేవు కదా..? వాటిల్లా దోపిడీ ముఠాలను క్రియేట్‌ చేయలేదు కదా? 
  • ఆ సంస్థకు లాయర్‌ కపిల్‌ సిబాల్‌..ఆయన కోట్లలో తీసుకుంటాడు..
  • ఆ సొమ్ము ఈ సిటిజన్స్‌ ఫర్‌ డెమెక్రసీ వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది..? – చంద్రబాబు ఇస్తున్నాడు..ఆడిస్తున్నాడు. 
  • చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సేవా మిత్రల ద్వారా, నేడు జనం తిరస్కరించాక ఇలాంటి బ్యూరోక్రాట్స్‌తో కేసులు వేయిస్తున్నాడు. 
  • పొద్దున లేచినప్పటి నుంచీ ఆ ఎల్లో పేపర్లలో, ఎల్లో టీవీల్లో చర్చలు పెట్టుకుంటూ వెళ్తారు. 

ప్రపంచంలోనే డీప్‌ ఫేక్‌ చంద్రబాబు

  • నీకు ఈ దౌర్భాగ్యం అవసరమా చంద్రబాబూ..?
  • దీనికంటే లక్షణంగా చేయగలిగింది రాయల్‌గా చెప్పొచ్చుగా..? 
  • జగన్‌ గారు ఫాలో అవుతున్నది రాజమార్గం..చేయగలిగిందే చెప్పాలి
  • దాన్ని అమలు చేసి మళ్లీ ప్రజల వద్దకు వెళ్లడం మంచి మార్గం
  • కానీ చంద్రబాబు మాత్రం అడ్డదారుల్లో అదిరిపోయే దారేది అని వెతుక్కుంటున్నాడు. – గోడ దూకడం ఎలా అని ఆలోచిస్తాడు
  • నువ్వు వెన్నుపోటు పొడిచి వచ్చినా, 2014–19 మధ్య ప్రజలు నీకు మళ్లీ అవకాశం ఇచ్చారు
  • అప్పుడైనా ప్రజలకు సేవ చేయాల్సింది..కానీ ఆయనకు ఆ లక్షణం లేదు
  • ప్రపంచంలోనే డీప్‌ ఫేక్‌ చంద్రబాబునాయుడు. ఇంతకంటే డీప్‌ ఫేక్‌ ఏదీ ఉండదు. 
  • చేయలేనిది ఏదీ, బలవంతంగా దేనినీ జగన్‌ గారితో చెప్పించలేరనేది గతంలోనే చూశాం
  • రుణమాఫీ చేయలేని అని ఆనాడు జగన్‌ గారు స్పష్టంగా చెప్పారు
  • ఎన్నికల ముందు కొంచెమన్నా చేస్తామని చెప్పాలని మా లాంటి వారు చెప్పినా ఆయన ససేమిరా అన్నారు
  • దానివల్ల నేను ప్రతిపక్షంలో కూర్చున్నా పర్లేదు అన్నారు. అదీ జగన్ గారి నిబద్ధత
  • బ్యాంకుల్లో కుదవ పెట్టిన మీ బంగారంతో సహా విడిపిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఏం చేశాడో అందరూ చూశారు
  • చంద్రబాబుకు ఉన్న విశ్వసనీయత అక్రమాల్లోనే. అదే ఒరిజినల్‌ చంద్రబాబు

స్కాం సత్యం.. స్కామ్‌స్టర్‌ బాబు అనేదే సత్యం..!

  • అరెస్టు కాకముందు ఏ రోగమూ లేని వాడు.. అరెస్ట్‌ అయిన తర్వాత ప్రపంచంలోని అన్ని రోగాలున్నాయని కోర్టులకు చెప్పారు. 
  • మెడికల్‌ బెయిల్‌ వచ్చినా సత్యమేవ జయతే అంటారు..నిన్న రెగ్యులర్‌ బెయిల్‌ వచ్చినా సత్యం గెలిచింది అంటారు. 
  • అందులో స్కాం మాత్రమే సత్యం.. స్కాంస్టర్‌ బాబు అనేది సత్యం. చివరికి అదే బయటపడుతుంది...
  • సిస్టమ్‌లోకి వైరస్‌ వచ్చినట్లు చంద్రబాబు, ఆయన ముఠా కూడా వైరస్‌లానే వెళ్తున్నారు. 
  • ఈ కుట్ర పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి. 

 మీడియా ప్రశ్నలు–సమాధానాలు

  • ఎన్నికల కమిషన్‌ను మా పార్టీ వారు కూడా కలుస్తారు. ఎక్కడ ఏ పోరాటం చేయాలో ఆ పోరాటాలు చేస్తాం. 
  • మా పార్టీ వైపు నుంచే కాకుండా ఇలాంటి దొంగదెబ్బ కొట్టే వారి గురించి అప్రమత్తంగా ఉండమని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా మాకుంది. 
  • బేసిక్‌ గేమ్‌ రూల్స్‌ ధర్మబద్ధంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మేధావులు, విద్యావంతులపై ఉంది. – వారు అప్రమత్తంగా ఉండి..వారి వాయిస్‌ను రెయిజ్‌ చేయాలి. 
  • వాలంటీర్లు ఏం డేటా తీసుకుంటున్నారో కనుక్కోమనండి. ఓపెన్‌గానే వాలంటీర్లు పథకాల అర్హతను తీసుకుంటున్నారు. 
  • టీడీపీ వారికి కానీ, ఇంకెవరికైనా రావాల్సిన బెన్‌ఫిట్స్‌ ఆగాయా? 
  • జగన్‌ గారు శాచురేషన్‌ పద్దతిలో ముందుకు వెళ్తుంటే.. ఇక రాకపోవడానికి అవకాశమే లేదు. 
  • అన్ని పార్టీల వారికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఎవరికైనా రాలేదంటే తీసుకుని రండి..
  • ఆ మేసేజ్‌ చూడగానే అభినందనలు అంటే లాటరీ కాకుండా ఏం గుర్తుకు వస్తుంది? 
  • అప్పుడే ఈయన సంతకంతో హామీ పత్రం ఇస్తే దీనిని ఏ తరహా చీటింగ్‌ అనాలి

ఇదీ చదవండి: బాబు బెయిల్‌ తీర్పులో ఏముంది?.. కొన్ని సందేహాలు.. అనుమానాలు!

మరిన్ని వార్తలు