Huzurabad: గెలుపు ఖాయం.. గెల్లు శ్రీనివాస్‌తో సీఎం కేసీఆర్‌

14 Aug, 2021 12:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ శుక్రవారం పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో కలిశారు. తనను హుజూరాబాద్‌ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను అభినందించిన కేసీఆర్‌.. హుజూరాబాద్‌లో పార్టీ గెలుపు ఖాయమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని చెప్పారు. పార్టీ ఇన్‌చార్జీల సూచనలకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటర్ల మద్దతు కోరాల్సిందిగా సూచించారు. ఈ నెల 16న హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపైనా సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు