అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం.. వినూత్న నిరసన

1 Apr, 2023 18:41 IST|Sakshi

సాక్షి, తిరుపతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్‌సీపీ నేత కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు.

నలుగురు ఎమ్మెల్యేల కటౌట్లకు నల్ల జెండాలు కట్టిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. వెంకటగిరిలోని కైవల్యా నదిలో  నిమజ్జనం చేశాయి. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేలకు పుట్టగతులు ఉండవని రాంప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.
చదవండి: ‘నెల్లూరులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు’

మరిన్ని వార్తలు