‘బావ’సారూప్యం అంటే ఇదేనేమో!.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

25 Nov, 2023 11:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో మద్యం అక్రమాలపై ట్విటర్‌(ఎక్స్‌) వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకిపారేశారు. ‘‘మద్యం ప్రివిలేజి ఫీజు తొలగించి చంద్రబాబు, కొల్లు రవీంద్ర 1300 కోట్లు కొల్లగొట్టారు. రూ.1500 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. కళ్లద్దాల వల్ల పురందేశ్వరి గారికి ఇలాంటివి కనిపించవు. పున్నమ్మా.. దాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టేయత్నం చేయడం అన్యాయం అనిపించడం లేదా?’’ అంటూ ట్వీట్‌ చేశారు.

‘‘చంద్రబాబు.. బీజేపీలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టీడీపీ భజన చేస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైలులో ఉన్న టీడీపీ జిల్లా నాయకులను పురందేశ్వరి సలహా మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులు పరామర్శించి సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లింది. 'బావ’సారూప్యం అంటే ఇదేనేమో!’’ అంటూ మరో ట్వీట్‌లో చురకలు అంటించారు.
చదవండి: సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!
 

మరిన్ని వార్తలు