4 నెలల క్రితమే కువైట్‌ నుంచి..

24 Dec, 2023 01:44 IST|Sakshi
డ్రైవర్‌ బాబు కుటుంబ సభ్యులు

ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్‌ షేక్‌ అబ్దుల్‌ హుస్సేన్‌ అలియాస్‌ బాబుది మార్కాపురం. నాలుగు నెలల క్రితమే దుబాయ్‌ నుంచి వచ్చి ఆటో బాడుగకు తీసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య రమీజాబీ, కూతుర్లు ఆరీఫా, రబియా ఉన్నారు. శుక్రవారం కూడా యథావిధిగా ఆటో తీసుకుని సాయంత్రం కల్లా వస్తానని కూతుర్లతో చెప్పి వెళ్లిన బాబు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని పిల్లలిద్దరూ తండ్రి మృతదేహం చూసి విలపించారు. ఇక మా కుటుంబానికి దిక్కెవరంటూ రోదించారు. ఇలా మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో వైద్యశాలంతా విషాదకర వాతావరణం నెలకొంది.

>
మరిన్ని వార్తలు